బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 అక్టోబరు 2015 (11:52 IST)

ప్రియుడిని రోకలి బండతో మోది చంపేసిన మహిళ లొంగుబాటు

తనతో రెండేళ్ళపాటు సహజీవనం చేసి ఆ తర్వాత మోసం చేశాడన్న అక్కసుతో ప్రియుడిని రోకలి బండతో కొట్టి చంపిన మహిళ పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ కేసు వివరాలను పరిశీలిస్తే కృష్ణా జిల్లా రెడ్డిగూడెం మండలం, ముచ్చెనపల్లి గ్రామానికి చెందిన శాంతకుమారి (30) అనే మహిళ.. జి కొండూరు మండలానికి చెందన పి. బాబూ రాజేంద్ర (38)తో రెండేళ్ళుగా సహజీవనం చేస్తూ వస్తోంది. 
 
ఈ క్రమంలో ఆ మహిళ నుంచి దూరమయ్యేందుకు రాజేంద్రం ఓ ఎత్తుగడ వేశాడు. ఇందులోభాగంగా జి కొండూరు వదిలి వెళ్లిపోదామంటూ ఆమెపై ఒత్తిడి తెచ్చాడు. దీనికి ఆమె సమ్మతించలేదు. ఈ విషయాన్ని గ్రహించిన శాంతకుమారి ఇంటి వద్దే ప్రియుడి తలపై రోకలి బండతో కొట్టింది. తీవ్రంగా గాయపడిన రాజేంద్ర అక్కడే మృతిచెందాడు. అనంతరం శాంతకుమారి నేరుగా వెళ్లి రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది.