బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 26 జులై 2017 (15:15 IST)

తమ్ముడి భార్యను బావ వివస్త్రను చేశాడు.. భర్త ఫోనులో వీడియో తీశాడు.. సిగ్గు సిగ్గు..

తమ్ముడి భార్యను ఓ బావ వివస్త్రను చేసిన దుర్ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.... వీణవంక, మండలం బ్రాహ్మణ పల్లిలో తమ్ముడి భ

తమ్ముడి భార్యను ఓ బావ వివస్త్రను చేసిన దుర్ఘటన కరీంనగర్‌లో చోటుచేసుకుంది. సభ్యసమాజం తలదించుకునే ఈ ఘటన స్థానికంగా సంచలనం రేకెత్తిస్తోంది. వివరాల్లోకి వెళితే.... వీణవంక, మండలం బ్రాహ్మణ పల్లిలో తమ్ముడి భార్యను ఓ బావ వివస్త్ర చేశాడు. అంతేగాకుండా.. అత్యాచారయత్నం చేయబోయి.. హత్య చేసేందుకు కూడా ప్రయత్నించాడు. దీనిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని.. హెచ్చార్సీని ఆశ్రయించింది. బావ భూమా రెడ్డి తమ్ముడి భార్యను వివస్త్రను చేసిన ఘటనకు ఆతడి భార్య కవిత, తల్లిదండ్రులు గోపాల్ రెడ్డి, ప్రమీలా, సోదరి కూడా సహకరించారు. 
 
అంతేకాదు.. భర్త శ్రీనివాస్ రెడ్డి ఈ దృశ్యాలను ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ ఘటనపై హెచ్చార్సీ సీరియస్ అయ్యింది. సెప్టెంబర్ 25వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని సీపీకి హెచ్చార్సీ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వారు ఏమాత్రం స్పందించలేదని.. ఈ ఘోరానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలి తల్లిదండ్రులు హెచ్చార్సీని డిమాండ్ చేశారు. 
 
ఇంత ఘోరం జరుగుతున్నా.. పోలీసులు నిందితులకు వత్తాసు పలికారని బాధితురాలు బంధువులు మండిపడుతున్నారు. భూవివాదంలో భర్త సోదరుడితో బాధితురాలు గొడవకు దిగడంతోనే ఈ దురాగతానికి ఆమె బావ ఒడిగట్టాడని తెలిపారు. కాగా హెచ్చార్సీ రంగంలోకి దిగడంతో నిర్భయ చట్టం కింద నిందితుడిపై కేసు నమోదు చేశారు. వీడియో ఫూటేజీని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు.