బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : సోమవారం, 31 ఆగస్టు 2015 (22:17 IST)

చిట్టీల పేరుతో రూ.60 లక్షల మోసం.. మహిళ పరార్

చిట్టీల పేరుతో ఓ మహిళ జనాన్ని మోసం చేసింది. దాదాపు రూ. 60 లక్షలు పోగేసిన ఆమె ఉన్నట్లుండి మాయమయ్యింది. వివరాలిలా ఉన్నాయి. 
 
గ్రామానికి చెందిన వడ్లమూడి పార్వతి సుమారు 15 ఏళ్ల నుంచి చిట్టీల వ్యాపారం నిర్వహిస్తోంది. సుమారు 60 మందికి పైగా ఆమె వలలో మోసపోయిన బాధితులు ఉన్నారు. ఆదివారం సాయంత్రం నుంచి పార్వతి ఇంటికి తాళాలు వేసి ఉండటంతో బాధితులు ఆమె కోసం బంధువుల ఇళ్ల వద్దకు వెళ్లినా ప్రయోజనం లేకపోవడంతో లబోదిబోమంటున్నారు. 
 
రూ. 60 లక్షలు పోగేసిన పార్వతి పరారయ్యింది. కుటుంబ సభ్యులు తమకు సంబంధం లేదని చెబుతున్నారని బాధితులు పేర్కొన్నారు.