శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2016 (12:53 IST)

యాసిడ్ ఇంజెక్షన్‌తో ఇల్లాలిని చంపేసిన ప్రియురాలు... చీరాలలో దారుణం!

పరాయి పురుషుడిపై మనస్సుపడిన ఓ మహిళ... అతనితో పడక సుఖం పంచుకునేందుకే ఏకంగా అతని భార్యనే మట్టుబెట్టింది. అదీ కూడా యాసిడ్ ఇంజెక్షన్ తో దాడి చేసి హతమార్చింది. ఇందుకోసం ఆ మహిళకు మరో ఇద్దరు మహిళలు సహకరించడం గమనార్హం. ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
చీరాల ఎల్‌బీఎస్‌ నగర్‌కు చెందిన ఇలియాజ్‌ అనే వ్యక్తికి చీరాల, గుంటూరుల్లో చికెన్‌ షాపులున్నాయి. దుకాణం పనిమీద గుంటూరు వెళ్లే ఇలియాజ్‌కు అక్కడ వహీదా అనే మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం ఇలియాజ్ భార్య హసీనాకు తెలిసింది. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలకు దారితీసింది. పైగా, ఫోనులో వహీదాను హసీనా తిడుతూ వచ్చింది. ఈ తిట్లు భరించలేదని వహీదా.. ఆమెను ఎలాగైనా హతమార్చాలని ప్లాన్ వేసింది. 
 
ఈ ప్లాన్‌లో భాగంగా ఇద్దరు మహిళలను తీసుకుని మంగళవారం చీరాలకు చేరుకుంది. సాయంత్రం 5 గంటల సమయంలో ఇలియాజ్‌ ఇంటికి వెళ్లింది. ఇద్దరు మహిళలు హసీనాను గట్టిగా పట్టుకోగా మరొకరు సిరంజిలో యాసిడ్‌ (బంగారాన్ని శుద్ధి చేయడానికి వాడే ద్రావణాన్ని) ఎక్కించి హసీనా మెడపైన, చేతిపైనా ఇంజెక్షన్‌ చేశారు. ఆ దృశ్యాన్ని చూసిన హసీనా పిల్లలు కేకలు వేయడంతో ముగ్గురూ అక్కడ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. 
 
అయితే, పిల్లల కేకలను గమనించిన స్థానికులు ఆ ముగ్గురినీ పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. అస్వస్థతకు లోనైన హసీనాను స్థానికంగా ఓ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడ నుంచి గుంటూరుకు తరలించగా చికిత్సపొందుతూ ఆమె మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు వహీదాను, ఆమెతోపాటు వచ్చిన ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.