శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 10 జులై 2017 (09:42 IST)

నారా భువనేశ్వరికి దండం పెడతానంటున్న జగన్ చెల్లెలు.. ఎందుకు?

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని అనుకుంటున్నట్టు వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల అంటోంది. ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓసారి

ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి దండం పెట్టాలని అనుకుంటున్నట్టు వైకాపా అధినేత వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్. షర్మిల అంటోంది. ఆమె ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారో ఓసారి పరిశీలిద్ధాం. గుంటూరు వేదికగా వైకాపా ప్లీనరీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె పైవిధంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 
 
'తన తండ్రి(ఎన్టీఆర్‌)కి వెన్నుపోటు పొడిచి అధికారం లాక్కొన్న చంద్రబాబు మోసాన్ని భరిస్తూ తాళి చూసుకుంటున్న భువనేశ్వరికి.. నిజంగా దండం పెట్టవచ్చు' అని షర్మిల వ్యాఖ్యానించారు. నిజానికి కొద్దికాలంగా మీడియాకు దూరంగా ఉన్న షర్మిల అమరావతిలో నిర్వహించిన వైసీపీ ప్లీనరీ మీటింగ్‌లో పాల్గొని చంద్రబాబుపై విమర్శలు గుప్పించి.. నారా భువనేశ్వరికి దండం పెట్టాలంటూ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.