మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (14:06 IST)

పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ గెలిచింది లేదంటే గోవిందో గోవింద!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నగరి శాసన సభ్యురాలు, ప్రముఖ నటి రోజు మంగళవారం నిప్పులు చెరిగారు. అదే సమయంలో జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఎన్నికలలో గెలిచిందని రోజా వ్యాఖ్యానించారు.
 
మంగళవారం చిత్తూరు జిల్లాలో రోజా మాట్లాడుతూ.. రైతుల రుణమాఫీపైన చంద్రబాబుకు ఏమాత్రం స్పష్టత లేదన్నారు. రైతులను మభ్యపెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ పైన కాలయాపన చేసేందుకే ఆయన కమిటీలు అంటూ కథలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 
 
ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించినప్పుడు రుణమాఫీకి ఎన్ని కోట్లు కావాలో చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నిత్యం రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటుందని ఆమె చెప్పారు. పవన్ కళ్యాణ్ వల్లనే టీడీపీ ఇటీవల జరిగిన ఎన్నికలలో గెలుపొందిందని విమర్శించారు. లేకుంటే టీడీపీకి ఎన్నికల్లో గెలుపు సాధ్యమయ్యేది కాదని రోజా అన్నారు. పవనే మమ్మల్ని ఓడించారని, టీడీపీ కాదని రోజా వ్యాఖ్యానించారు.