శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (09:50 IST)

ఆర్టీసీ బస్సుల్లో వైఫై సేవలు... గంట పాటు ఫ్రీ, ఆ పై రూ. 10..!

ప్రైవేటు రవాణా సంస్థల పోటీకి ధీటుగా ప్రభుత్వ రవాణా సంస్థ కూడా ఆర్టీసీ బస్సుల్లో అత్యాధునిక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఆర్టీసీ ప్రయాణించే ప్రయాణికుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ వైఫై సౌకర్యం కల్పించనుంది. ఈ 'వైఫై' సౌకర్యం ఏప్రిల్ 1 నుంచి ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో అందుబాటులోకి రానుంది. 
 
ఈ సౌకర్యం విజయవాడ నుంచి ప్రారంభమై, హైదరాబాదు, విశాఖపట్టణం, తిరుపతి, బెంగళూరు నగరాలకు రాకపోకలు సాగించే వెన్నెల, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో అందుబాటులో ఉంచనుంది. ఆ తర్వాత దీనిని నెమ్మదిగా విశాఖపట్టణం, గుంటూరు, తిరుపతి కేంద్రాలుగా నడిచే బస్సులకు విస్తరించాలని ఆర్టీసీ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
ఈ అత్యాధునిక సౌకర్యం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకులు గంటపాటు వైఫై సేవలను ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటును ఆర్టీ కల్పిస్తోంది. తరువాత 10 రూపాయలు చెల్లిస్తే గమ్యం చేరేవరకు ఎంతసేపైనా వైఫై వినియోగించుకోవచ్చని ఆర్టీసీ తెలిపింది. 
 
ఆ ప్రకారం వైఫై కోసం బస్సులో ఓ కంప్యూటర్, వైఫై పరికరం అందుబాటులో ఉంటాయట. ఈ కంప్యూటర్ లో 50 సినిమాలు, 400 వీడియో పాటలు అందుబాటులో ఉంచుతారట. వీటిని వారివారి మొబైల్, ల్యాప్ టాప్, స్మార్ట్ ఫోన్, ఐప్యాడ్ లలో వీక్షించుకోవచ్చని ఆర్టీసీ చెబుతోంది.