మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : శనివారం, 28 మార్చి 2015 (13:59 IST)

నవ వధువుపై సామూహిక అత్యాచారం.. కిడ్నాప్..!

తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లాలో దారుణం సంఘటన చోటుచేసుకుంది. పెళ్లికి సిద్ధమైన నవ జంటపై దాడికి పాల్పడిన దుండుగులు యువకుడిని చితకబాదారు. అనంతరం వధువుపై సామూహికంగా అత్యాచారం చేసి, ఆమెను కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు.
 
దుండగుల దాడితో తీవ్రంగా గాయపడిన బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేశారు. అతను ఇచ్చిన వివరాల మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దుండగుల కోసం గాలింపు చేపట్టారు. ఈ సంఘటన ఆ ప్రాంతంలో కలకలం రేపింది.