బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 24 జులై 2016 (11:18 IST)

ప్రేమించాడు.. తాళి కట్టాడు... తల్లిదండ్రులు అభ్యంతరంతో కాపురం చేయనంటున్నాడు!

తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 18 యేళ్ల యువతిని ప్రేమించిన ఓ యువకుడు.. స్థానిక అమ్మవారి సాక్షిగా దేవాలయంలో తాళికట్టాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు.

తూర్పుగోదావరి జిల్లా ముమ్ముడివరంలో ఓ వింత ఘటన చోటుచేసుకుంది. 18 యేళ్ల యువతిని ప్రేమించిన ఓ యువకుడు.. స్థానిక అమ్మవారి సాక్షిగా దేవాలయంలో తాళికట్టాడు. ఆ తర్వాత ఇంటికి తీసుకెళ్లాడు. కానీ, ఈ ప్రేమ పెళ్లికి తల్లిదండ్రులు అభ్యంతరం చెప్పారు. దీంతో కట్టుకున్న భార్యతో కాపురం చేసేందుకు ససేమిరా అంటున్నారు. దీంతో భర్త ఇంటిముందు భార్య మౌనపోరాటానికి దిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఆత్రేయపురం మండలం పేరవరానికి చెందిన వేముల దుర్గ (18) అమ్మమ్మ ఊరు అయినాపురం చిట్టిచెరువుకు చెందిన నిచ్చెనకోళ్ల నాగరత్నం ఇంటి వద్ద ఉంటూ చదువుకుంటోంది. యేడాది క్రితం అదే గ్రామానికి చెందిన శెనగన కృపాపాల్‌తో ప్రేమలో పడింది. నెలరోజుల క్రితం పేరవరం వెళ్లడంతో ఆదివారం కృపాపాల్‌ అక్కడికి వెళ్లి దుర్గను తీసుకువచ్చాడు. 
 
గత సోమవారం మహిపాల చెరువు వద్ద కనకదుర్గ ఆలయంలో తాళికట్టి ఇంటికి తీసుకొచ్చాడు. వారిద్దరినీ ఇంట్లోకి ఆహ్వానించాల్సిన తల్లిదండ్రులు పెళ్లికి అభ్యంతరం చెప్పారు. దీంతో భార్యను తీసుకెళ్లి పుట్టింట్లో వదిలేశాడు. ఈ విషయంపై పెద్దలు పంచాయితీ నిర్వహించినా, పోలీసులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగకపోవడంతో శుక్రవారం రాత్రి నుంచి కృపాపాల్‌ ఇంటి ఎదుట దీక్ష చేపట్టినట్టు దుర్గ తెలిపింది.