మోడీతో భేటీ... ప్రత్యేక హోదాపై వైఎస్ జగన్ చర్చ..!
వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోమవారం సాయంత్రం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆయన ఢిల్లీలోని రేస్ కోర్స్లోని మోడీ నివాసానికి పార్టీ ఎంపీలతో కలిసి వెళ్లి సమావేశమయ్యారు. అనంతరం బయటకు వచ్చిన జగన్ విలేకర్లతో మాట్లాడుతూ.. మోడీతో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సహా పలు కీలక అంశాలను గురించి చర్చించినట్టు తెలిపారు.
అదే విధంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టు తదితర అంశాలను మోడీ దృష్టికి తీసుకువెళ్లినట్లు జగన్ వెల్లడించారు. తాము చెప్పిన అన్ని అంశాలను పరిశీలించి, త్వరలో మంచి నిర్ణయం తీసుకుంటామని మోడీ చెప్పినట్టు జగన్ వెల్లడించారు.