శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 22 నవంబరు 2014 (11:19 IST)

డిసెంబర్ 8న తెలంగాణలో పరామర్శ యాత్ర!

వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిళ తెలంగాణలో చేపట్టే పరామర్శ యాత్ర డిసెంబర్ 8న పాలమూరులో ప్రారంభం కానుంది. 5 రోజుల పాటు ఏకబిగిన జరగనున్న ఈ యాత్రలో ఆమె, మొత్తం ఐదు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం గుండెపోటుతో మరణించిన 16 మందికి చెందిన కుటుంబాలను ఈ పర్యటనలో ఆమె పరామర్శిస్తారు.
 
పాలమూరు జిల్లాలో యాత్ర పూర్తి అయిన తర్వాత తెలంగాణలోని ఇతర జిల్లాల్లో కూడా ఆమె పరామర్శ యాత్ర చేపట్టనున్నారని ఆ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. 
 
గతంలో ఓదార్పు యాత్ర పేరిట జగన్ చేపట్టిన ఈ యాత్ర ఖమ్మం జిల్లా తర్వాత ముందుకు సాగలేదు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తదుపరి యాత్రను షర్మిళ చేపడతారని ఆ పార్టీ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే.