శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (10:43 IST)

వైఎస్సార్ ఐదో వర్ధంతి : ఇడుపులపాయలో జగన్ నివాళులు!

నేడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఐదో వర్థంతి. ఈ సందర్భంగా వైఎస్ జగన్, ఆయన కుటుంబ సభ్యులు ఇడుపులపాయలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ దగ్గర ఆయనకు నివాళులు అర్పించనున్నారు. 
 
వీరితో పాటు వైసీపీ అగ్రనాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఇడుపులపాయకు చేరుకుంటున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించడానికి వైసీపీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి.