శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 23 జులై 2014 (09:54 IST)

పవన్ కళ్యాణ్ వల్లే ఓడామనే విషయం ఇన్నాళ్ళకి తెలిసిందా?

జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైఎస్ఆర్ సీపీ నేతలకు గత అసెంబ్లీ, లోక్‍సభ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయామో ఇన్నాళ్ళకు తెలిసినట్టుంది. టాలీవుడ్ స్టార్ పవన్ కల్యాణ్ కారణంగానే మొన్నటి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిందని, పవన్ కళ్యాణ్ కారణంగానే టీడీపీ గెలుపొందిందని నగరి శాసనసభ్యురాలు, వైసీపీ నాయకురాలు రోజా అన్నారు. 
 
ఇదే అంశంపై చిత్తూరులో నగరి ఎమ్మెల్యే, సినీ నటి రోజా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడిన సందర్భంగా ఈ టాపిక్ తీసుకొచ్చారు. రైతుల రుణమాఫీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన తమకు అర్థం కావడం లేదని రోజా చెప్పారు. రుణమాఫీ విషయంలో చంద్రబాబు రైతులను మభ్యపెట్టడానికే ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.