గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 1 సెప్టెంబరు 2014 (12:45 IST)

పరలోకంలో ఉన్న నా తండ్రి వైఎస్ అంతా చూస్తున్నారు : జగన్

పరలోకంలో ఉన్న ఉన్న నా తండ్రి వైఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అంశాన్నీ చూస్తున్నారనీ వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి అంటున్నారు. వైఎస్సార్ మరణించి ఐదేళ్ళు అవుతున్నా, ఇప్పటికీ ప్రతి విషయాన్నీ ఆయన పేరుకు ఆపాదించడం టీడీపీకి మామూలైపోయిందని బాధపడుతున్నారు. 
 
సోమవారం అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో ఎన్నికల్లో పట్టుబడిన మద్యం, నమోదు చేసిన కేసులపై టీడీపీ సభ్యుడు బోండా ఉమా మహేశ్వరరావు మాట్లాడుతూ వైఎస్ఆర్ పేరును ప్రస్తావించారు. దీనికి జగన్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. 'వైఎస్ఆర్ చనిపోయి అయిదు సంవత్సరాలుపైన అయ్యింది... ఎన్నికలు జరిగి ముడు నెలలు అయ్యింది. ఈ మూడు నెలల్లో జరిగినవి కూడా వైఎస్ఆర్కే ఆపాదించటం టీడీపీకే చెల్లుతుందని' ఆయన వ్యాఖ్యానించారు.