శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 27 ఆగస్టు 2015 (12:02 IST)

రాష్ట్రానికి రక్షా బంధన్.. బంద్ ఆ రోజే జరగాలి: బొత్స సత్తిబాబు

శ్రావణ పూర్ణిమ రోజున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని ఆ పార్టీ నేత బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. 29న వైకాపా తలపెట్టిన బంద్‌ను వెనక్కి తీసుకునే ప్రసక్తేలేదని బొత్స తేల్చి చెప్పేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసమే బంద్ చేపట్టామని, పార్టీ బలోపేతం కోసం తలపెట్టిన బంద్ కాదని మీడియా సమావేశంలో వివరించారు. ఈ బంద్‌లో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. 
 
ఈ బంద్‌ను రాష్ట్రానికి రక్షా బంధన్ దినోత్సవంగా చేయాలని బొత్స పిలుపునిచ్చారు. తమ బంద్‌కు వామపక్షాలు మద్దతు తెలిపాయన్నారు. కాగా వైకాపా బంద్‌కు పిలుపునిచ్చిన ఆగస్టు 29న రాఖీ పండుగ కావడంతో బంద్‌పై పునరాలోచించుకోవాలని ప్రజా సంఘాలు కోరినప్పటికీ వైసీపీ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. బంద్‌ను రక్షాబంధన్ రోజే నిర్వహిస్తామని బొత్స తేల్చి చెప్పేశారు.