శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 అక్టోబరు 2016 (20:33 IST)

వైకాపాలో మరో వికెట్ డౌన్.. చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన వేదవ్యాస్

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు మరో షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సీనియర్ నేత బూరగడ్డ వేదవ

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైకాపాకు మరో షాక్ తగిలింది. ఈ పార్టీకి చెందిన సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో చేరారు. టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో సీనియర్ నేత బూరగడ్డ వేదవ్యాస్ శుక్రవారం సైకిలెక్కారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని వచ్చిన ఆయన్ని అభినందిస్తున్నానని అన్నారు. వేదవ్యాస్ కుటుంబ సభ్యులు, అనుచరులు, కార్యకర్తలను టీడీపీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నానని చంద్రబాబు చెప్పారు. పెడన నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను టీడీపీలో చేరుతున్నానని ఈ సందర్భంగా వేదవ్యాస్ పేర్కొన్నారు.