మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 26 మే 2016 (18:41 IST)

జగన్ మోహన్ రెడ్డికి మరో షాక్... మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్ చేసేందుకు రెడీ...?

వైసీపీ ఎంత పట్టు బిగిద్దామనుకుంటున్నా జారిపోయేవారు జారీపోతూనే ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జంప్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మె

వైసీపీ ఎంత పట్టు బిగిద్దామనుకుంటున్నా జారిపోయేవారు జారీపోతూనే ఉన్నారు. వైసీపీకి మరో షాక్ తగలబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో ఎమ్మెల్యే జంప్ చేయనున్నట్లు చెప్పుకుంటున్నారు. ప్రకాశం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెదేపాలోకి చేరాలని కసరత్తు చేస్తున్నట్లు తెలు్సతోంది. 
 
తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో ఆయన మంతనాలు సాగిస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కాగా అశోక్ రెడ్డి వైకాపాకు గుడ్ బై చెపుతారని దాదాపు నెల రోజుల నుంచి గుసగుసలుగా చెప్పుకుంటున్నారు. ఐతే తను తెదేపాలో చేరబోవడం లేదని ఆయన ఖండించారు. ఐతే మరోసారి అశోక్ రెడ్డి పార్టీ మారుతారనే ఊహాగానాలు జోరందుకున్నాయి.