ఎవడ్రా చెప్పాడు... రూ.10 కోట్లు తీసుకున్నాననీ : చాంద్ బాషా ఎదురుదాడి!
తాను పది కోట్ల రూపాయలకు అమ్ముడుపోయినట్టు జరుగుతున్న ప్రచారంపై అనంతపురం జిల్లా కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా మండిపడ్డారు. తాను పది కోట్ల రూపాయలకు అమ్ముడు పోయినట్టు ఎవడ్రా చెప్పాడు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
వైకాపాకు చెందిన ఈ ఎమ్మెల్యే ఇటీవల టీడీపీలో చేరిన విషయంతెల్సిందే. దీంతో వైకాపా నేతలు చాంద్ భాషాపై మండిపడుతున్నారు. టీడీపీలో చేరేందుకు రూ.పది కోట్లు తీసుకున్నారంటూ ఆరోపించారు.
దీనిపై చాంద్ బాషా స్పందించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని, అమ్ముడుపోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. అదేవిధంగా, టీడీపీలో చేరుతున్న వైకాపా ఎమ్మెల్యేలంతా అమ్ముడు పోయారనేది అవాస్తవమంటూ ఆయన కొట్టిపారేశారు.