గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 21 ఏప్రియల్ 2017 (10:21 IST)

రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తాడట... 'జబర్దస్త్' కామెడీ కంటే లోకేష్ కామెడీ చాలా బాగుంది : రోజా ఎద్దేవా

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెం

రాష్ట్ర ఐటీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై వైకాపా ఎమ్మెల్యే ఆర్కే.రోజా తనదైనశైలిలో సెటైర్లు వేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ నారా లోకేశ్‌ చేసిన వ్యాఖ్యలపై ఆమె కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తెస్తానంటూ లోకేష్ చెప్పగానే.. ఆయన మామ బాలకృష్ణ హిందూపురంలో అమలుచేసి చూపించారని రోజా ఎద్దేవా చేశారు.
 
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ మంత్రి పదవి చేపట్టాక లోకేశ్‌ చేస్తున్న కామెడీ జబర్దస్త్‌ను దాటేసిందన్నారు. అందువల్ల ఇకపై జబర్దస్త్ షోకు వీక్షకులు తగ్గిపోతారేమో అనే సందేహాన్ని వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాగునీటి ఎద్దడిని సృష్టించడానికే పంచాయతీరాజ్‌ శాఖ మంత్రిని అయ్యానంటూ తన మనసులో మాటను లోకేశ్‌ బయటపెట్టారని అన్నారు.
 
చెప్పినవిధంగానే తన తండ్రి, మామ నియోజకవర్గాలైన కుప్పం, హిందూపురంలో నీళ్లు దొరక్కుండా చేశారన్నారు. లోకేశ్‌ ప్రతి మాటలోనూ తప్పులు దొర్లుతున్నాయని, వాటిని ప్రసారం చేస్తున్న సోషల్‌ మీడియాను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నారని రోజా ఆరోపించారు.