వైకాపా జిల్లాల వారీగా సమీక్ష : ముగ్గురు సభ్యులతో కమిటీ
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన మొదలు పెట్టింది. వైకాపా జిల్లాల వారీగా సమీక్ష నిర్వహించడంలో భాగంగా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం ఆయా జిల్లాల్లో పర్యటించనుంది.
పార్టీ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి ప్రసాదరాజు, విజయ సాయిరెడ్డిలతో వైఎస్ఆర్ సీపీ ఓ కమిటీని ఏర్పాటు చేసింది.
ఈ నెల 25న కృష్ణా, 26న గుంటూరు, 27న ప్రకాశం, 28న నెల్లూరు, 29న తిరుపతి, 30 వైఎస్ఆర్ జిల్లా, 31న అనంతపురం, నవంబర్ 1వ తేదీన కర్నూలు జిల్లాల్లో ఈ కమిటీ పర్యటించనుంది.