శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 మే 2016 (19:06 IST)

చంద్రబాబు రూ.30 కోట్లిచ్చారా..? 30 పైసల్ కూడా ఇవ్వలేదు నేనే లక్ష ఇచ్చా!!

తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రూ.30 లక్షలు ఇవ్వడంతో పసుపు పార్టీలోకి జంప్ అయినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని మాజీ వైకాపా నేత, ప్రస్తుత టీడీపీ నేత జలీల్ ఖాన్ స్పష్టం చేశారు. వైకాపా నుంచి తెలుగుదేశం పార్టీలో చేరామనే కారణంతో తమపై ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు.. ఆ పార్టీ నేతలు తమపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. 
 
సోమవారం విజయవాడలో జలీల్ ఖాన్ మాట్లాడుతూ.. నిజానికి సీఎం చంద్రబాబు తమకు 30 పైసలు కూడా ఇవ్వలేదన్నారు. టీడీపీలో చేరడం జీర్ణించుకోలేక జగన్ పార్టీ నేతలు రూ.30 లక్షల్ని తాము తీసుకున్నట్లు లేనిపోని విమర్శలు చేస్తున్నారన్నారు. తానే చంద్రబాబుకు లక్ష రూపాయలిచ్చానని.. పార్టీ ఫండ్‌గానే ఆ మొత్తాన్ని కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. 
 
మహానాడుకు చంద్రబాబు పడుతున్న కష్టం చూసి ఆ డబ్బిచ్చానని తెలిపారు. ఇంకా నిధుల కొరత.. రాజధాని లేని ఏపీకి చంద్రబాబు చేసే అభివృద్ధి పనుల కోసం తాము సహాయపడుతామని జలీల్ ఖాన్ స్పష్టం చేశారు.