బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Updated : శనివారం, 4 జులై 2015 (17:04 IST)

తిరుమల ఘాట్ రోడ్డులో జీపు బోల్తా.. నలుగురికి గాయాలు

తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో శనివారం మధ్యాహ్నం జీపు బోల్తా పడింది. ఈ సంఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బోల్తా పడిన జీపును మరోకారు ఢీకొంది. దీంతో ఆ కారు దెబ్బతింది. వివరాలిలా ఉన్నాయి. 

తిరుమల నుంచి కొందరు భక్తులు తిరుపతికి తిరుగు ప్రయాణమయ్యారు. ఈ సమయంలో ఘాట్ రోడ్డులో 16 మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి జీపు బోల్తా పడింది. ఈ సంఘటనలో జీపులో ప్రయాణిస్తున్న భక్తులలో నలుగురికి గాయాలయ్యాయి. మరోవైపు వెనుక నుంచి వచ్చిన కారు కూడా బోల్తా కొట్టిన జీపును ఢీకొంది. కాగా గాయపడిన భక్తులను రుయా ఆసుపత్రికి తరలించారు.