శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. ప్రశ్నలు- సమాధానాలు
Written By Raman
Last Modified: మంగళవారం, 24 నవంబరు 2015 (17:30 IST)

7 వత్తులు ఏకంచేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేయండి( శ్రీనివాస్ కుమార్-వేగివాడ)

శ్రీనివాస్ కుమార్-వేగివాడ: మీరు తదియ శనివారం, ధనుర్ లగ్నం, చిత్తా నక్షత్రం, తులారాశి నందు జన్మించారు. 2017 వరకు ఏల్నాటి శని అధికంగా ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 20సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి 7 వత్తులు ఏకం చేసి నువ్వుల నూనెతో శనికి దీపారాధన చేసిన దోషాలు తొలగిపోతాయి. 2014 నుంచి శని మహర్దశ ప్రారంభమైంది. ఈ శని మీకు మంచి అభివృద్ధి ఇస్తుంది. ఈ శని 2017 నుంచి 2033 వరకు సత్ఫలితాలను ఇవ్వగలదు. ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, 2016 డిసెంబరు వరకు ఉంటాయి అని గమనించగలరు. శనిదోషం తొలగిపోగానే దోషాలు తొలగిపోగలవు. ప్రతిరోజు వల్లీదేవసేనేస సుబ్రహ్మణ్యస్వామిని పూజించి, ఆరాధించండి. మనోసిద్ధి, సంకల్పసిద్ధి కానవస్తుంది.
 
గమనిక: మీ సందేహాలను [email protected] కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.