గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By Selvi
Last Updated : బుధవారం, 12 అక్టోబరు 2016 (14:20 IST)

పెరుగులో జీలకర్ర పొడిని కలుపుకుని తింటే.. ఏమౌతుందో తెలుసా?

పెరుగులో జీలకర్ర పొడితో కలుపుకుని తింటే బరువు తగ్గుతారు. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరమవుతాయి. పెరుగులో తేనె క‌లిపి తీసుక

పెరుగులో జీలకర్ర పొడితో కలుపుకుని తింటే బరువు తగ్గుతారు. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తీసుకుంటే శరీర వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. ఇన్ఫెక్షన్లు, వ్యాధులు దూరమవుతాయి. పెరుగులో తేనె క‌లిపి తీసుకుంటే క‌డుపులో ఉన్న అల్స‌ర్‌లు మటుమాయ‌మైపోతాయి. ఈ మిశ్ర‌మం యాంటీ బయోటిక్‌గా ప‌నిచేస్తుంది. దీని వ‌ల్ల శ‌రీరంలో ఉన్న ఇన్‌ఫెక్ష‌న్లు వెంట‌నే త‌గ్గుతాయి.
 
పెరుగులో ఆరెంజ్ జ్యూస్ క‌లిపి తింటే శ‌రీరానికి త‌గినంత విట‌మిన్ సి ల‌భిస్తుంది. ఇది కీళ్ల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. వృద్ధాప్య ఛాయ‌ల‌ను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. పెరుగులో చ‌క్కెర క‌లుపుకుని తినడం ద్వారా శరీరానికి వెంటనే శక్తి అందుతుంది. తద్వారా మూత్రాశ‌య సంబంధ స‌మ‌స్య‌లు కూడా పోతాయి. కొంత వాము తీసుకుని ఓ క‌ప్పు పెరుగులో క‌లిపి తినాలి. దీని వ‌ల్ల నోటి పూత, దంల నొప్పి, ఇత‌ర దంత సంబంధ స‌మ‌స్య‌లు పోతాయి.
 
ఇంకా పెరుగులో ఓట్స్ కలిపి తీసుకుంటే మంచి ప్రోబ‌యోటిక్స్‌, ప్రోటీన్లు ల‌భిస్తాయి. ఇవి కండ‌రాల పుష్టికి దోహ‌దం చేస్తాయి. పెరుగులో కొంత ప‌సుపు, కొంత అల్లం క‌లిపి తినాలి. దీని వ‌ల్ల ఫోలిక్ యాసిడ్ శ‌ర‌రీంలోకి చేరుతుంది. ఇది చిన్నారుల‌కు, గ‌ర్భిణీ మ‌హిళ‌ల‌కు ఎంత‌గానో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.