మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 24 సెప్టెంబరు 2018 (12:35 IST)

గుడ్డుసొనలో అవకాడో మిశ్రమం కలుపుకుని ముఖానికి రాసుకుంటే?

టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీ

టీట్రీ ఆయిల్‌లో కొద్దిగా టూత్‌పేస్ట్ కలుపుకుని చర్మానికి రాసుకోవాలి. 10 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే చర్మం మృదువుగా మారుతుంది. పైనాపిల్ జ్యూస్‌లో కొద్దిగా నిమ్మరసం, పాలు, టమోటా జ్యూస్ కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం ముడతలు తొలగిపోతాయి.

 
గుడ్డుసొనలో అవకాడో మిశ్రమాన్ని కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకుంటే చర్మం కాంతివంతంగా మారుతుంది. రోజ్ వాటర్‌లో తేనెను కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే  ఉపశమనం లభిస్తుంది. 
 
ఆలివ్ నూనెను తలకు రాసుకుని బాగా మర్దనా చేసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా వారినికి రెండసార్లు చేయడం వలన జుట్టు రాలే సమస్యలు తొలగిపోతాయి. రోజ్ వాటర్‌ను తలకు రాసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోతాయి.