శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (12:38 IST)

నిమ్మరసం, తేనెతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే?

గుడ్డు తెల్లసొనలో కొద్దిగా అరటి పండు గుజ్జు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. తేలలో కొద్దిగా పసుపు కలుపు

గుడ్డు తెల్లసొనలో కొద్దిగా అరటి పండు గుజ్జు కలుపుకుని జుట్టుకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్యలు తొలగిపోయి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. తేలలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ముఖం కాంతివంతంగా మారుతుంది.
 
నిమ్మరసంలో కొద్దిగా తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 15 నిమిషాల తరువాత కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది. పెరుగులో తేనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. దీంతో ముఖం తాజాగా మారుతుంది. 
 
బాదం మిశ్రమంలో కొద్దిగా పెరుగు, ఆలివ్ నూనెను కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. తద్వారా ముఖంపై గల నల్లటి వలయాలు, మచ్చలు తొలగిపోయి ముఖం మృదువుగా, తెల్లగా మారుతుంది.