శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : శుక్రవారం, 21 సెప్టెంబరు 2018 (12:06 IST)

బొప్పాయి గుజ్జు, ముల్తానీ మట్టితో ఫేస్‌ప్యాక్ వేసుకుంటే?

శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్

శెనగపిండిలో కొద్దిగా పసుపు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం ముడతులు తొలగిపోయి కాంతివంతంగా మారుతుంది. కొబ్బరినూనెను మెడకు, ముఖానికి రాసుకుని 15 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేయడం వలన ముఖం మృదువుగా మారుతుంది.
 
కలబంద గుజ్జులో పసుపు, తేనె, పాలు కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వలన ముఖంపై గల మెుటిమలు, నల్లటి వలయాలు తొలగిపోతాయి. బేకింగ్ సోడాలో ఆలివ్ నూనె, తేనె కలుపుకుని ముఖానికి ప్యాక్‌లా వేసుకుని అరగంట తరువాత శుభ్రం చేసుకుంటే ముఖం తాజాగా మారుతుంది. 
 
నిమ్మరసంలో పంచదార కలుపుకుని ముఖానికి, మెడకు రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది. బొప్పాయి గుజ్జులో కొద్దిగా ముల్తానీ మట్టి, తేనె కలుపుకుని ముఖానికి రాసుకోవాలి. అరగంట తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి.