అరకప్పు ఓట్స్తో కాంతివంతమైన చర్మం!
అరకప్పు ఓట్స్ను తీసుకుని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి. దీనికి పెరుగు, టమోటా గుజ్జు కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, అరగంట తర్వాత గోరు వెచ్చని నీటితో కడిగేసుకోవాలి.
వారానికోసారి ఇలా చేస్తే మురికి, మృతకణాలు తొలగిపోయి ముఖం కాంతివంతమవుతుంది. అలాగే.. బాదంపప్పు పేస్టులో పాలు, నిమ్మరసం, కాసింత మినప్పిండి కలిపి ప్యాక్లా వేసుకున్నా ముఖం మెరిసిపోతుంది.