'వర్ణమాలై' పేరుతో ఏషియన్ సరికొత్త పెయింట్స్!
వచ్చే సంక్రాంతి పండుగ కోసం ఏషియన్ పెయింట్స్ సరికొత్త పెయింట్స్ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. వర్ణమాలై పేరుతో ప్రత్యేకంగా రూపొందించిన రంగుల్లో ట్రాక్టర్ ఎమల్షన్ పెయింట్స్ను మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చింది. ఈ పెయింట్స్కు సంబంధించి బ్రోచర్స్ను సినీ నటి రాధికా శరత్ కుమార్ చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించారు.
ఇదే అంశంపై ఏషియన్ పెయింట్స్ లిమిటెడ్, మార్కెటింగ్ అండ్ టెక్నాలజీ, సేల్స్ విభాగం అధిపతి అమిత్ సింఘాలే మాట్లాడుతూ.. గత ఏడు దశాబ్దాలుగా పెయింటింగ్స్ రంగంలో తమ కంపెనీ సేవలు అందిస్తున్నట్టు తెలిపారు. తమకు 2.1 మిలియన్ కష్టమర్లు ఉన్నారని తెలిపారు.
అయితే, తాజాగా ప్రవేశపెట్టిన వర్ణమాలై పెయింటింగ్స్ను ఆవిష్కరించేందుకు తమ మార్కెటింగ్ మరియు రీసెర్స్ విభాగం పరిశోధనలు చేసి అందమైన రంగులను సృష్టించినట్టు తెలిపారు. వర్ణమాలై రంగులను వాడిన గృహాల్లోనే అనేక సీరియల్స్ను తీస్తున్నట్టు తెలిపారు. ట్రాక్టర్ ఎమల్షన్ పెయింట్స్ సాధారణ డిస్టెంబర్స్ రంగుల కంటే రెట్టింపు కాంతిని ఇస్తాయని తెలిపారు. ఇవి 1700 షేడ్స్లలో అందుబాటులో ఉన్నట్టు తెలిపారు.
అనంతరం రాధికా శరత్ కుమార్ మాట్లాడుతూ ఏషియన్ పెయింట్స్ ప్రవేశపెట్టిన ట్రాక్టర్ ఎమల్షన్ వర్ణమాలై సంక్రాంతి శోభను మరింత ఇనుమడింపజేసేలా ఉన్నాయన్నారు. అయితే, మనం నివశించే ఇంటికి, పడక గది, లివింగ్ రూమ్, పూజా గదులకు సరిపడ రంగులను ఎంపిక చేయడం ఓ సవాల్తో కూడుకున్న పని అని చెప్పారు.