గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (10:27 IST)

మళ్లీ బొగ్గు క్షేత్రాల వేలం పాటలు : కేంద్రం కార్యదర్శి అనిల్ స్వరూప్

అక్రమాలు చోటుచేసుకున్నాయని పేర్కొంటూ సుప్రీంకోర్టు రద్దు చేసిన బొగ్గు గనులను తిరిగి వేలం వేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ వేలం పాటలు ఫిబ్రవరి 11 నుంచి మొదలు కానుంది. దీనిపై కేంద్ర బొగ్గు గనుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ స్వరూప్ మాట్లాడుతూ.. తొలి దశలో 74 గనుల వేలాన్ని చేపడతామని, తర్వాతి దశల్లో మిగిలిన గనుల కేటాయింపులకు చర్యలు తీసుకుంటామని ఆయన వెల్లడించారు.
 
అంతేకాకుండా, బొగ్గు గనుల రంగంలో కొన్ని కంపెనీల గుత్తాధిపత్యానికి చెక్ పెట్టేందుకు ఒక కంపెనీ పరిమితికి లోబడే వేలంలో పాల్గొనాలన్న కొత్త నిబంధనను ఈ వేలం పాటల్లో అమలు చేయనున్నట్టు తెలిపారు. కేటాయింపుల్లో భారీ ఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయన్న కారణంగా 204 బొగ్గు గనులను సుప్రీంకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. వీటి కేటాయింపుల కోసం కొత్తగా వేలం నిర్వహించాలని కూడా కేంద్రాన్ని కోర్టు ఆదేశించింది.