శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Modified: మంగళవారం, 25 నవంబరు 2014 (12:55 IST)

బిఎండబ్ల్యు నుంచి ఎం 5 సెడాన్ కొత్త కారు.. ధర రూ.1.35 కోట్లు!

జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం బిఎండబ్ల్యు భారత్ మార్కెట్‌లోకి సరికొత్త మోడల్ బిఎండబ్ల్యు ఎం5 సెడాన్‌ను విడుదల చేసింది. ఈ కారు ధర. 1.35 కోట్ల రూపాయలుగా (ఎక్స్‌షోరూమ్‌ ఢిల్లీ) నిర్ణయించింది. పెట్రోల్‌ వేరియంట్‌లో అందుబాటులో ఉన్న ఈ కారులో అధిక శక్తి, ఆధునిక సదుపాయాలు ఉన్నాయని బిఎండబ్ల్యు గ్రూప్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఫిలిప్‌ వాన్‌ సార్‌ తెలిపారు. 
 
ముఖ్యంగా.. కేవలం 4.3 సెకండ్ల వ్యవధిలోనే ఈ కారు 100 కిలో మీటర్ల వేగాన్ని అందుకుంటుందని తెలిపారు. ఈ కారులో అన్ని వైపులా ఎయిర్‌ బ్యాగ్స్‌, యాక్టివ్‌ ఎం డిఫరెన్షియల్‌, డైనమిక్‌ స్టెబిలిటీ కంట్రోల్‌ (డిఎస్‌సి), యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టమ్‌, యాక్టివ్‌ ప్రొటెక్షన్‌ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నట్టు ఆయన తెలిపారు.