శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 1 ఫిబ్రవరి 2019 (11:40 IST)

#BudgetSession2019 : రైతులకు ఎన్నికల తాయిలం : యేడాదికి రూ.6 వేలు పంటసాయం...

ఎన్నికల సమయంలో రైతులకు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం తాయిలం ప్రకటించింది. ప్రకృతి వైపరీత్యాల, అప్పుల కారణంగా బక్కచిక్కిపోతున్న రైతులను ఆదుకునేందుకు కేంద్ర ముందుకు వచ్చింది. ఇందులోభాగంగా, పీఎం కిసాన్ స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద చిన్న, సన్నకారు రైతులకు యేడాదికి రూ.6 వేల ఆర్థిక సాయం అందజేస్తారు. 
 
ఈ పథకం 2018 డిసెంబరు నెల నుంచి అమల్లోకి వస్తుందని విత్తమంత్రి పియూష్ గోయల్ తెలిపారు. ఈ పథకం కింద యేడాదికి 6 వేల రూపాయలను రైతు బ్యాంకు ఖాతాలకే నేరుగా డిపాజిట్ చేస్తామన్నారు. ఈ నిధులను మూడు దఫాలుగా జమ చేస్తామని తెలిపారు. 
 
ఒక్కో దఫాలో రూ.2 వేలు చొప్పు మొత్తం ఆరు వేల రూపాయలను జమ చేస్తామని వివరించారు. మొదటి విడతగా తక్షణఁ రూ.2 వేలు జమ చేయనున్నట్టు ప్రకటించారు. అయితే, ఈ పథకం కేవలు ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులకు మాత్రమే వర్తిస్తుంది.

దీనివల్ల 12 కోట్ల మంది రైతులు లబ్ది పొందుతారని చెప్పారు. ప్రకృతి విపత్తుల్లో పంటలు నష్టపోయిన రైతులకు పంటరుణాలు రీషెడ్యూల్, రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. ప్రధానమంత్రి సమ్మాన్ కిసాన్ నిధికి యేటా రూ.6 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు.