శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 3 ఆగస్టు 2015 (14:52 IST)

దువ్వూరి సుబ్బారావు సంతకంతో కరెన్సీ నోట్లు ముద్రించిన ఆర్బీఐ దివాస్

భారత రిజర్వు బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ 'దివాస్' భారీ తప్పిదం చేసింది. మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకంతో భారీ మొత్తంలో కరెన్సీ నోట్లను ముద్రించింది. ఈ విషయం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తనిఖీల్లో బట్టబయలైంది. నిజానికి భారత రిజర్వు బ్యాంకు గవర్నర్లు మారితే ఆ తదుపరి సంవత్సరం జనవరి నుంచి ముద్రించే అన్ని కరెన్సీ నోట్లపై కొత్త గవర్నరు సంతకముండాలి. కానీ, ఆర్బీఐ గవర్నరుగా సెప్టెంబర్ 2013లోనే రఘురాం రాజన్ బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ముద్రించిన రూ.500 నోట్లను మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సంతకంతోనే భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ 'దివాస్' ముద్రించింది.
 
ఇలా మొత్తం రూ.37.2 కోట్ల విలువైన కొత్త కరెన్సీ మాజీ గవర్నర్ సంతకంతో ముద్రితమైనట్టు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) కనుగొంది. వీటన్నింటినీ మార్కెట్లోకి పంపరాదని ఆదేశించింది. దీంతో రూ.20, రూ.100, రూ.500 నోట్లను ముద్రణా కార్యాలయంలోనే ఉంచేశారు. ఈ విషయంలో ఆర్బీఐ అభిప్రాయాన్ని స్వీకరించిన తర్వాత వీటిని ఏం చేయాలన్న విషయంపై నిర్ణయం తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. రఘురాం రాజన్ సంతకంతో కేవలం రూ.10 కొత్త నోట్లపై మాత్రమే రాజన్ సంతకం కనిపిస్తోంది.