బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (17:18 IST)

కొత్త పుంతలు తొక్కుతోన్న స్మగ్లింగ్: డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో బంగారం బిస్కెట్లు!

భారత్‌లో స్మగ్లింగ్ కొత్త పుంతలు తొక్కుతోంది. డిటర్జెంట్ పౌడర్ ప్యాకెట్లలో 12 కేజీల బంగారం బిస్కెట్లు పెట్టి మలేషియా నుంచి శ్రీలంకలోని కొలంబో మీదుగా తమిళనాడులోని ట్యుటుకోరిన్ పోర్టుకు పంపారు. స్మగ్లర్ల సూచన మేరకు అచ్చం అలాంటి కంటైనర్‌ను సిద్ధం చేసిన ఉంచిన రిసీవర్లు, ఆ కంటైనర్‌ను తప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారణ మొదలెట్టారు. 
 
స్మగ్లింగ్‌కు కస్టమ్స్, ఎక్సైజ్ అధికారులు ఎప్పటికప్పుడు చెక్ పెడుతున్నా.. అధికారుల కంటే ఒకడుగు ముందుగానే ఉన్న స్మగ్లర్లు వారి అడుగులను పసిగడుతూ వినూత్న మార్గాలు వెతుక్కుంటున్నారు. డర్టీ ట్రిక్స్‌తో స్మగ్లింగ్‌కు కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని అధికారులు తెలిపారు.