బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 19 సెప్టెంబరు 2017 (10:42 IST)

హరికేన్ వల్లే ఇంధన ధరలు పెరుగుదల : పెట్రోలియం మంత్రి

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన

కరేబియన్ దీవులతో పాటు అమెరికాలో వచ్చిన హరికేన్ తుఫాను వల్లే దేశంలో ఇంధన ధరలు పెరిగాయని పెట్రోలియం శాఖామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యానించారు. అయితే, దీపావళి నాటికి ఈ ధరలు దిగివచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. 
 
గత రెండు నెలలుగా ఇంధన ధరలు పెరిగిపోతున్న విషయం తెల్సిందే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నా ప్రభుత్వం మాత్రం ఏమాత్రం పట్టించుకోకుండా ఉంది. ఈ నేపథ్యంలో ధర్మేంద్ర ప్రధాన్ స్పందిస్తూ, అమెరికాను వణికించిన హార్వే, ఇర్మా తుఫానుల కారణంగా, అంతర్జాతీయంగా రిఫైనరీ ఔట్ పుట్ 13 శాతం పడిపోయిందని... ఈ కారణంగానే ఇంధన ధరలు పెరిగాయన్నారు. 
 
అయితే, దీపావళి నాటికి వీటి ధరలు తగ్గుతాయన్నారు. వచ్చే నెలలో ధరలు తగ్గుముఖం పడతాయని చెప్పారు. రోజువారీ ఇంధన ధరల సమీక్ష చేపట్టినప్పటి నుంచి వీటి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ విధానంపై విమర్శలు వచ్చినప్పటికీ... మంత్రి మాత్రం రోజువారీ ధరల సమీక్ష చాలా పారదర్శకంగా ఉందని సమాధానం చెప్పారు.