గురువారం, 18 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 8 మార్చి 2017 (18:10 IST)

పవర్ సేవింగ్ - గ్రీన్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో గోడ్రెజ్ సరికొత్త ఏసీ

హోం అప్లయెన్సెస్ తయారీలో అగ్రగామిగా ఉన్న గోడ్రెజ్ కంపెనీ తాజాగా సరికొత్త ఏసీని అవిష్కరించింది. ఈ కంపెనీ బుధవారం పవర్ సేవింగ్, గ్రీన్ ఇన్వెర్టర్ ఎయిర్ కండీషనర్‌ను విడుదల చేసింది. ఎన్ఎక్స్‌డబ్ల్యూ పేరుత

హోం అప్లయెన్సెస్ తయారీలో అగ్రగామిగా ఉన్న గోడ్రెజ్ కంపెనీ తాజాగా సరికొత్త ఏసీని అవిష్కరించింది. ఈ కంపెనీ బుధవారం పవర్ సేవింగ్, గ్రీన్ ఇన్వెర్టర్ ఎయిర్ కండీషనర్‌ను విడుదల చేసింది. ఎన్ఎక్స్‌డబ్ల్యూ పేరుతో 5.8 ఈస్సీర్‌ రేటింగ్‌తో ఈ ఏసీ అందుబాటులోకి వచ్చింది. గోడ్రెజ్ ఎన్ఎక్స్‌డబ్ల్యూ ఇన్వెర్టర్ ఏసీలను యునిక్యూ గ్రీన్ ఇన్వెర్టర్ టెక్నాలజీతో తయారు చేశారు. ఇన్వెర్టర్ టెక్నాలజీ, గ్రీన్ బ్యాలెన్స్ టెక్నాలజీలు ఒకదానికొకటి బ్యాలెన్స్ చేసుకుంటూ ఎకో ఫ్రెండ్లీగా పని చేస్తూ అధిక విద్యుత్ ఆదాకు దోహదం చేస్తాయి. 
 
ఈ ఏసీ ఆవిష్కరణ సందర్భంగా గోడ్రెజ్ అప్లయెన్సెన్స్ బిజినెజ్ హెడ్ కమల్ నంది మాట్లాడుతూ వినియోగదారులకు ఎకో ఫ్రెండ్లీగా పని చేసేలా వీటిని తయారు చేసినట్టు తెలిపారు. అంతేకాకుండా ఏసీల విభాగంలో పెట్టుబడులను రెట్టింపు చేయనున్నట్టు తెలిపారు. వచ్చే 2018 నాటికి దేశీయంగా 5 స్టార్, ఇన్వెర్టర్ ఏసీ సెగ్మెంట్‌లో తమ కంపెనీ 20 శాతం వాటాను దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. 
 
భారత వాతావరణ శాఖ అంచనా మేరకు.. ఈ యేడాది ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయిలో నమోదుకానున్నాయని, దీన్ని రుజువు చేసేలా ఇప్పటికే ఎండలు మండిపోతున్నాయన్నారు. అందువల్ల ఈ యేడాది ఏసీల విక్రయాలు ఎక్కువగా ఉండవచ్చని తెలిపారు. అలాగే, తాము కొత్తగా ప్రవేశపెట్టిన గోడ్రెజ్ ఎన్ఎక్స్‌డబ్ల్యూ ఏసీ వినియోగదారు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని వివరించారు.