గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Modified: మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (18:34 IST)

భారతదేశపు మొట్టమొదటి ఇంటర్నెట్ కార్ విడుదల... వివరాలు....

న్యూఢిల్లీ: మార్క్యూ బ్రిటిష్ ఆటో మేకర్ అయిన ఎంజి మోటార్ (మోరిస్ గ్యారేజస్) నేడు ప్రపంచ టెక్ లీడర్స్ భాగ్యస్వామ్యం ద్వార అనుసంధానించబడిన కనెక్షన్ కోసం ఐ-స్మార్ట్ నెక్స్ట్ జెన్ అభివృద్ధి చేసిన ఇదివరకు ఎప్పుడూ చూడని నూతన కార్ టెక్నాలజీని ప్రదర్శించారు. ఈ ఏడాది జూన్ మాసాంతానికి అమ్మకాలకు అందుబాటులో రానున్న, ఎంజి హెక్టర్లో ఐస్మార్ట్ నెక్స్ట్ జెన్‌తో ఉన్న ఎంజి హెక్టర్  అనేది భారతదేశంలో మొట్టమొదటి ఇంటర్నెట్ కారుగా ఉంటుంది. ఇది కనెక్ట్ చేయబడిన మొబిలిటీని పునర్నిర్వచనం చేస్తుంది.
 
మైక్రోసాఫ్ట్, అడోబ్, ఉన్లిమిట్, శాప్, సిస్కో, గాన, టామ్ టామ్ మరియు నూయన్సు వంటి ప్రపంచ టెక్ భాగస్వాములు దాని బలమైన కన్సార్టియంతో పాటు, కార్ల తయారీ సంస్థ అనేక పరిశ్రమ మొదటి ఫీచర్స్‌తో కూడిన ఇంటర్నెట్ ఎనేబుల్డ్ కార్స్‌ని ఎంజి హెక్టర్‌లో లభిస్తాయి.
 
ఐస్మార్ట్ నెక్స్ట్ జెన్ యొక్క బ్రెయిన్ 10.4” హెడ్ యూనిట్లో కలిగి ఉంటుంది. కార్ వ్యవస్థను కేవలం టచ్ లేదా వాయిస్ కమాండ్తో నియంత్రించడానికి డ్రైవర్‌ను అనుమతించే నిలువుగా ఉండే ఇంటర్‌ఫేస్‌తో స్క్రీన్ రూపొందించబడింది. హెడ్ యూనిట్ భారతదేశం యొక్క తీవ్ర వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు నిర్మించబడింది. ఇది వినోద కంటెంట్‌తో ముందే లోడ్ చేయబడుతుంది. ఎంజి హెక్టర్ ఐస్మార్ట్ నెక్స్ట్ జెన్ పరిశ్రమ ఒక మొట్టమొదటి ఎంబెడెడ్ M2M సిమ్‌తో వస్తుంది. ఇది కారు అనుసంధానించబడి ఉందని నిర్ధారిస్తుంది. 
 
"కార్లతో ఇంటర్నెట్ యొక్క ఏకీకరణ అనేది భారతదేశంలో MG వినియోగదారుల కోసం అందించబడుతోంది. ఒక ఎంబెడెడ్ సిమ్ కార్డు మరియు OTAతో, ఎంజి హెక్టర్ నిరంతరం విస్తరించే సామర్ధ్యాలతో ఎక్కువ సమయం చేసే, కారు జీవితం అంతా అవాంతరం లేని డ్రైవింగ్ అనుభవాన్ని ఇచ్చేందుకు వీలు కల్పిస్తుంది " అని ఎంజి మోటార్ ఇండియా, ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ - రాజీవ్ చాబా అన్నారు."ఇంకా, భారతదేశంలో 5G కనెక్టివిటీ ఆగమనంతో, ఎంజి కార్లలో డ్రైవింగ్ అనుభవం మరింత సంపన్నం చేస్తుంది అని ," చాబా అన్నారు. ఎంజి నుంచి రాబోయే ఇంటర్నెట్ కార్ల యొక్క మరిన్ని ఫీచర్ల కోసం mgmotor.co.in/ismart చూడవచ్చు.