శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (12:09 IST)

ఆదివారం ఇక డీజిల్, పెట్రోల్ బంకులుండవ్.. 2017 మే 14 నుంచి డీలర్ సెలవు..

పెట్రోల్, డీజిల్ బంకులు ఇకపై ఆదివారం సెలవు ప్రకటించారు. మే 14 నుంచి ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే కాకుండా.. ప్రతి ఆదివారం రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ తెలిపార

పెట్రోల్, డీజిల్ బంకులు ఇకపై ఆదివారం సెలవు ప్రకటించారు. మే 14 నుంచి ప్రతి ఆదివారం కేవలం ప్రభుత్వాఫీసులకు మాత్రమే కాకుండా.. ప్రతి ఆదివారం రిటైల్ అవుట్ లెట్లు మూసివేయనున్నామని పెట్రోలియం డీలర్స్ తెలిపారు. 2017 మే 14 నుంచి ప్రతి డీలర్ సెలవు తీసుకోవాలని సీఐపీడీ ఆదేశించినట్లు డీలర్స్ కన్సోర్టియం అధ్యక్షుడు ఏడీ సత్యనారాయణ్ చెప్పారు. 
 
కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ విజన్‌లో భాగంగా ఇంధన వినియోగాన్ని తగ్గించడానికి, హైయర్ డీలర్ కమిషన్ డిమాండ్ల నేపథ్యంలో కన్సోర్టియం ఆఫ్ ఇండియా పెట్రోలియం డీలర్స్(సీఐపీడీ) ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా దేశ వ్యాప్తంగా ఉన్న 25వేల పెట్రోల్ బంకులపై పడనుందని తెలుస్తోంది. లీటర్ డీజిల్‌పై రూపాయి 65పైసలు, లీటర్ పెట్రోల్‌పై రెండు రూపాయల 56పైసల కమిషన్‌ను ప్రస్తుతం డీలర్లు పొందుతున్నారు. 
 
ఈ కమిషన్‌ను మరింత పెంచాలని చాలాకాలంగా డీలర్స్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు డీలర్స్ కమిషన్ పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీనికి నిరసనగా వారు ప్రతి ఆదివారం తమ రిటైల్ అవుట్ లెట్లను మూస్తామని ప్రకటించారు. అంతేకాక  మే 10ని 'నో పర్చేస్ డే'గా చేపట్టబోతున్నారు.