శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 3 అక్టోబరు 2015 (12:20 IST)

మ్యాగీ కథ ఓవర్.. ఇక మార్కెట్లోకి పతంజలి న్యూడిల్స్!

ప్రమాదకర రసాయనాలు ఉన్నాయనే కారణందా నెస్లీ తయారీ చేసిన మ్యాగీ నూడుల్స్‌‌పై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున దాడులు జరిగాయి. నెలల పాటు జరిగిన పరీక్షల్లో రసాయనాలున్న మాట వాస్తవమేనని తేలింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోని మ్యాగీ స్టాకుల్ని వెనక్కి తీసుకున్న నెస్లీ.. ఆ తర్వాత రసాయనాలు లేని మ్యాగీ అంటూ మార్కెట్లోకి వచ్చింది. అయితే అప్పటికే మ్యాగీపై జరిగిన రాద్ధాంతంతో విక్రయాలు ఆశించినంతగా లేకపోవడంతో ఇక చేసేది లేక మ్యాగీ కథ ముగిసిపోయింది.
 
అదే సమయంలో ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ నేతృత్వంలోని ‘పతంజలి యోగా కేంద్రం’ కొత్తగా ‘పతంజలి’ బ్రాండ్‌తో నూడుల్స్ ను మార్కెట్లోకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే నూడుల్స్ ఉత్పత్తిని ప్రారంభించిన పతంజలి యోగా కేంద్రం త్వరలోనే మార్కెట్లోకి విడుదల చేసేందుకు సిద్ధమైంది. అంతేనా, మ్యాగీ నూడుల్స్ ధరలో సగం ధరకే పతంజలి నూడుల్స్ లభిస్తాయని తెలిసింది. తద్వారా మ్యాగీ బ్రాండ్ భారతీయ మార్కెట్ నుంచి తప్పకుండా దూరమవడం ఖాయమని వ్యాపార నిపుణులు అంటున్నారు.