శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 29 మే 2016 (15:17 IST)

భారత్‌లో మరింతగా వడ్డీరేట్లు తగ్గుతాయ్ : మోర్గాన్ స్టాన్లీ

భారత్‌లో మరింతగా వడ్డీరేట్లు తగ్గుతాయని ప్రముఖ రీసెర్స్ అండ్ రేటింగ్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ అభిప్రాయపడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా భారత్‌లో మరో అర శాతం వరకూ వడ్డీ రేట్లు తగ్గవచ్చని అంచనా వేసింది. జూన్ ఏడో తేదీన భారత రిజర్వు బ్యాంకు తన ద్రవ్య పరపతి విధానాన్ని వెల్లడించనుంది. ఇందులో మాత్రం కీలక రేట్ల సవరణ ఉండకపోవచ్చని ఓ నివేదిక విడుదల చేసింది.
 
తదుపరి రుతుపవనాలపై ఆధారపడి రిజర్వ్ బ్యాంక్ నిర్ణయాలు తీసుకోనుందని, ఈ సీజనులో అంచనాలకు తగ్గట్టు వర్షాలు పడితే, కీలక రేట్లు తగ్గించే వెసులుబాటు దగ్గరవుతుందని ఈ రిపోర్టు అంచనా వేసింది. వర్షాలు బాగుంటే ఆగస్టులో లేదా అక్టోబరులో వడ్డీ రేట్లు తగ్గవచ్చని తెలిపింది. కాగా, గత ఏప్రిల్ నెలలో రెపో రేటును పావు శాతం మేరకు తగ్గించిన విషయం తెల్సిందే 
 
దీంతో జనవరి 2015 నుంచి ఇప్పటి వరకూ ఒకటిన్నర శాతం మేరకు వడ్డీ రేట్లు తగ్గగా, ఆ మేరకు ప్రయోజనాలు మాత్రం ప్రజలకు దగ్గర కాలేదు. తమ మార్జిన్లు దెబ్బతింటాయన్న ఉద్దేశంతో, ఆర్బీఐ నిర్ణయాలను అమలు చేయడంలో బ్యాంకులు విస్మరిస్తున్నాయి. ఫలితంగా ఆర్బీఐ తగ్గింపు ఫలితం దేశ ప్రజలకు చేరడం లేదు.