శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 డిశెంబరు 2016 (11:40 IST)

ఇకపై ఇళ్లు - పొలాల్లో కూడా డబ్బు విత్‌డ్రా ఎలా? రిలయన్స్ జియో ఏర్పాట్లు

దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలను తీర్చేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ముందుకు వచ్చిది. ఇందుకోసం వాకింగ్ ఏటీఎంల పేరుతో స్వైప్ మిషన్లను అందుబాటులోకి తేనుంది.

దేశ వ్యాప్తంగా నెలకొన్న కరెన్సీ కష్టాలను తీర్చేందుకు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో ముందుకు వచ్చిది. ఇందుకోసం వాకింగ్ ఏటీఎంల పేరుతో స్వైప్ మిషన్లను అందుబాటులోకి తేనుంది. 
 
దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారా క్యాష్‌లెస్ విధానాన్ని అమల్లోకి తెచ్చి నల్లధనాన్ని నియంత్రించొచ్చని ప్రధాని నరేంద్ర మోడీ బలంగా భావిస్తున్నారు. ఇప్పటికే డిజిటల్ లావాదేవీలపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు 13 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఓ కమిటీని కూడా నియమించారు. ఈ కమిటీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సారథ్యం వహిస్తున్నారు. 
 
అయితే ఇప్పుడున్న నోట్ల కష్టాలను గ్రామాల్లో తగ్గించేందుకు మైక్రో ఏటీఎం కార్డులను ఇప్పటికే కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. అయితే వీటివల్ల నోట్ల కష్టాలు తీరుతున్నాయో లేదో తెలియదు కానీ రిలయన్స్ జియో కూడా ఈ విధానం ద్వారా ప్రజలకు మరింత చేరువకావాలని భావిస్తోంది. వాకింగ్ ఏటీఎం పేరుతో మైక్రో స్వైపింగ్ మెషిన్లను అందుబాటులోకి తీసుకునిరానుంది. 
 
ఆధార్ కార్డు నెంబర్ సాయంతో ఈ జియో మైక్రో ఏటీఎంలు పనిచేస్తాయి. దీని ద్వారా ఇంటి దగ్గరకు, పొలాల దగ్గరకెళ్లి గ్రామీణ ప్రాంత ప్రజలకు డబ్బునందించే వెసులుబాటు ఉంది. బ్యాంకు ఖాతా లేనివారికి కూడా ఆధార్ కార్డ్ వివరాలు నమోదు చేసుకుని, వేలిముద్రలు తీసుకుని అకౌంట్ ఓపెన్ చేసే సదుపాయం కూడా కల్పిస్తుంది. అయితే ఇవి ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో జియో యాజమాన్యం అధికారికంగా ప్రకటించలేదు.