శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 24 మే 2015 (14:04 IST)

బ్యాంకింగ్ రంగంలో 25 శాతం ఉద్యోగాలు పెంపు.. పంకజ్ బన్సాల్

బ్యాంకింగ్ రంగంలో గత ఏడాదితో పోల్చితే 25 శాతం ఉద్యోగాలు ఈ ఏడాది పెరుగుతాయని పీపుల్ స్ట్రాంగ్ వ్యవస్థాపక సీఈఓ పంకజ్ బన్సాల్ వెల్లడించారు. 2014తో పోలిస్తే నాలుగోవంతు అధికమందికి ఈ సంవత్సరం ఉద్యోగాలు లభించనున్నాయని, కింది స్థాయి ఉద్యోగుల నుంచి సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల వరకూ నియామకాలు జరగనున్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. 
 
కొత్త బ్యాంకులు ప్రారంభం అవుతుండడంతో, ఉద్యోగుల సంఖ్యా పెరగనుందని వివరించారు. ఉద్యోగుల వేతనాలు కూడా భారీగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్ బ్యాంకులు, ప్రభుత్వ బ్యాంకుల్లో సైతం కొత్త ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నారు. 
 
ఐడీఎఫ్‌సీ, బంధన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీలు బ్యాంకులను ప్రారంభించేందుకు ఆర్బీఐ అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారీస్థాయిలో కొత్త శాఖలు రానుండడం, వీటి కోసం వేలాది సంఖ్యలో నియామకాలు చేపట్టాల్సి ఉండడంతో బ్యాంకింగ్ రంగం ఉపాధి కల్పన విషయంలో మిగతా రంగాలతో పోల్చిచూస్తే ముందంజలో ఉందని పంకజ్ బన్సాల్ వివరించారు.