బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. చెన్నై వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 27 నవంబరు 2014 (14:51 IST)

వాహనంలో అమ్మాయిలు... వారిని ప్రదర్శిస్తూ బేరం... అక్కడ హైటెక్ వ్యభిచారం

వ్యభిచారం రొంపిలోకి అమ్మాయిలను దించుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే...
చెన్నై నగర శివారు ప్రాంతాల్లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం అందుకున్న పోలీసులు నిఘా వేశారు. ఈ క్రమంలో పాడి బస్టాండుకు దగ్గరలో విలాసవంతమైన స్కార్పియో వాహనంలో ముగ్గురు యువతులను ఉంచి వారిని చూపిస్తూ కస్టమర్లతో బేరమాడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 
 
అతడిని విచారించగా తను చెన్నైలోని షెనాయ్ నగర్ కు చెందినవాడినని చెప్పాడు. తను వ్యభిచారం ముఠాకు చెందిన వ్యక్తిగా అతడు ఒప్పుకున్నాడు. కాగా వాహనంలో ఉన్న అమ్మాయిలను చెర నుంచి విడిపించి స్కార్పియోను స్వాధీనం చేసుకున్నారు. 
 
ఇంకా ముఠాకు చెందిన వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పాడి సమీపంలోని ఓ విలాసవంతమైన భవనంలో వ్యభిచారం జరుగుతున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు అక్కడ తనిఖీలు చేసి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు యువతులను విడిపించారు. వ్యభిచారం కోసం ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను విమానంలో రప్పిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.