గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. వంటకాలు
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 28 నవంబరు 2014 (17:39 IST)

పకోడీలకు చేసే శనగపిండిలో పెరుగు కలిపితే..?

పకోడీలకు చేసే శనగపిండిలో పెరుగు కలిపితే పకోడీలు మెత్తగా వస్తాయి. క్రిస్పీగా కావాలంటే కాస్త బియ్యం పిండి కలుపు కోవాలి. 
 
వేరుశనగపప్పు వేయించాక బాగా రుచిగా ఉండాలంటే, బాగా వేడి నీటిలో వాటిని ఒక్క క్షణం ఉంచి తీసేసి, నీరంతా పోయే దాకా స్టెయినర్లో ఉంచి, ఆ తర్వాత వీటిని వేయించండి. చాల క్రిస్పీగా ఉంటాయి. 
 
సాధారణ పెనంపై ఒక చెంచా ఉప్పును వేయించి ఆ తరువాత దానిపై దోశలు వేస్తే నాన్‌స్టిక్ పెనంపై వేసినట్టుగా అంటుకోకుండా వస్తాయి. 
 
సలాడ్ కోసం పళ్ళు ముందుగానే కోసి పెట్టుకున్నా అవి నల్లగా మారకుండా ఉండాలంటే, వాటి మీద నిమ్మకాయ రసం పిండండి. రెండు పళ్లకు సగం నిమ్మకాయ రసం సరిపోతుంది.