గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఐవీఆర్
Last Modified: మంగళవారం, 16 ఫిబ్రవరి 2021 (16:36 IST)

ఫ్లాట్‌లో పార్టీ: ఒకే ఒక్కడు 103 మందికి కరోనా వైరస్‌ను అంటించాడు

బెంగళూరులోని బొమ్మనహళ్లిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో ఫిబ్రవరి 4న ఓ పార్టీ జరిగింది. ఈ పార్టీలో చాలామంది పాల్గొన్నారు. ఐతే కార్యక్రమంలో పాల్గొన్నవారిలో 103 మందికి కోవిడ్ -19 పాజిటివ్ అని తేలింది. బ్రూహత్ బెంగళూరు మహానగర పాలికే (బిబిఎంపి) కమిషనర్ ఎన్ మంజునాథ్ ప్రసాద్ మాట్లాడుతూ అపార్ట్‌మెంట్‌లోని 1,052 మంది నివాసితులలో 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని ధృవీకరించారు.
 
కోవిడ్ వైరస్ సోకిన 103 మందిలో 96 మంది 60 ఏళ్లు పైబడిన వారు కావడం గమనార్హం. బొమ్మనహళ్లిలోని ఎస్ఎన్ఎన్ లేక్ వ్యూ అపార్టుమెంట్లో ఫిబ్రవరి 4న పార్టీ జరిగింది. ఆ పార్టీకి ఎక్కువమంది నివాసితులు పాల్గొన్నారని బిబిఎంపి అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 10న వారి పరీక్ష ఫలితాలు చూడగా వారికి పాజిటివ్ అని తేలింది. దాంతో ఆ అపార్టుమెంటు మొత్తాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు.