బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (18:00 IST)

ముందే ఊహించా.. టెస్టుల్లో రాణించడం కలిసొచ్చింది: మురళీ విజయ్

జింబాబ్వే టూర్‌కు వెళ్తున్న భారత జట్టులో స్థానం దక్కించుకోవడం పట్ల బ్యాట్స్ మెన్ మురళీ విజయ్ హర్షం వ్యక్తం చేశాడు. సీనియర్లకు విశ్రాంతినిచ్చి.. యువకులకు బీసీసీఐ అవకాశం కల్పించడంతో మురళీ విజయ్‌కి వన్డే జట్టులో చోటు దక్కింది. దీనిపై మురళీ విజయ్ స్పందిస్తూ... తనకకు మళ్లీ భారత వన్డే జట్టులో స్థానం దక్కుతుందని ముందే ఊహించినట్లు చెప్పాడు. 
 
జింబాబ్వేలో పర్యటించే భారత జట్టులో స్థానం దక్కడం సంతోషంగా ఉందన్నాడు. ఇంకా విజయ్ మాట్లాడుతూ.. టెస్టుల్లో రాణించిన తర్వాత తన ఆత్మవిశ్వాసం మరింత మెరుగు పడిందని చెప్పాడు.

2013 ఛాంపియన్స్ ట్రోఫీ సహా నాలుగు సిరీస్‌లకు మూడో ఓపెన‌ర్‌గా తనను జట్టులోకి తీసుకున్నా, ఆడటానికి మాత్రం అవకాశం రాలేదని తెలిపాడు. అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోకుండా, టెస్టుల్లో రాణించానని చెప్పుకొచ్చాడు. ఇకపోతే జింబాబ్వే టూర్లో మెరుగైన ప్రదర్శనతో రాణించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తానని మురళీ విజయ్ వెల్లడించాడు.