నోరుజారిన ఇషాంత్ శర్మ: డిన్నర్కు ఎప్పుడు వస్తావని అడిగానంతే..!
శ్రీలంక సిరీస్లో భారత బౌలర్ ఇషాంత్ శర్మ నోరు జారాడు. గత మ్యాచ్లో జరిమానాకు గురైనప్పటికీ.. ఇషాంత్ శర్మ తనను తాను నియంత్రించుకోలేకపోతున్నాడు. తన బౌలింగ్ను సమర్థవంతంగా ఎదుర్కొంటూ క్రీజులో కుదురుకున్న హెరాత్పై మళ్లీ ఇషాంత్ నోరుజారాడు.
శ్రీలంకపై జరుగుతున్న మూడో టెస్టు మ్యాచు 32వ ఓవర్లో ఇషాంత్ విసిరిన షార్ట్లెంగ్త్ బంతిని హెరాత్ తప్పించుకున్నాడు. దీంతో ఒకరినొకరు కోపంగా చూసుకున్నారు. ఆపై ఇద్దరూ తిట్టుకోవడంతో అంపైర్లు, కోహ్లీ వారిని విడదీశారు.
తన తర్వాతి ఓవర్లోనే కుశాల్ పెరీరను అవుట్ చేసిన ఇషాంత్ అతను మైదానం వీడుతున్నప్పుడు మళ్లీ నోరు జారాడు. ఈ ఘటనపై మ్యాచ్ అనంతరం ఇషాంత్ మాట్లాడాడు. తన మాటలకు గమ్మత్తయిన ట్విస్ట్ ఇచ్చాడు ‘అతను నాకు మంచి మిత్రుడే. నాతో డిన్నర్కు ఎప్పుడు వస్తావని అడిగానంతే' అని చెప్పుకొచ్చాడు. తన రన్నప్ను కాస్తా తగ్గించుకున్నానని, బౌలింగ్ చేయడాన్ని ఎంతో ఆనందించానని, గ్రీన్ వికెట్ మీద బౌలింగ్ చేయడాన్ని ఆస్వాదించాన్నాడు.