శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 20 మార్చి 2015 (07:42 IST)

వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్స్ : నేడు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్థాన్!

వరల్డ్ కప్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లలో భాగంగా శుక్రవారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్ల మధ్య మూడో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ మరికొద్దిసేపట్లో ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్‌కు ఆడిలైడ్‌లోని ఓవల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ మ్యాచ్‌లో నెగ్గే జట్టే, ఈ నెల 26న సిడ్నీలో జరిగే సెమీ ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 
 
లీగ్ దశలో ఆడిన ఆరు మ్యాచ్‌లలో ఆసీస్ నాలుగింటిలో విజయం సాధించగా, ఓ మ్యాచ్‌లో ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. దీంతో గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచిన ఆ జట్టు పటిష్ఠంగానే ఉంది. ఇక గ్రూప్-బీలో ముక్కుతూ, మూలుగుతూ ఆడిన ఆరు మ్యాచ్‌లలో నాలుగింటిలో గెలిచి, రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైన పాక్ జట్టు తన గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో విజయం కోసం ఇరు జట్లు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి.
 
మరోవైపు.. గురువారం జరిగిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ సునాయాసంగా సెమీస్‌కు చేరుకున్న విషయం తెల్సిందే. మెల్ బోర్న్‌లోని ఎంసీజీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఏకపక్ష విజయంతో భారత్ సగర్వంగా సెమీస్‌లోకి అడుగిడింది.