శుక్రవారం, 29 మార్చి 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 30 జూన్ 2015 (15:46 IST)

భారత్‌పై బంగ్లా రికార్డు విజయం: మీడియా ఓవరాక్షన్.. అర గుండుతో మన క్రికెటర్లు..

భారత జట్టు తొలిసారి బంగ్లాదేశ్ గడ్డపై రికార్డు సృష్టించింది. అయిుతే టీమిండియాపై వన్డే సిరీస్ నెగ్గడంపై బంగ్లాదశ్ మీడియా ఓవరాక్షన్ చేస్తోంది. బంగ్లా ప్రముఖ పత్రిక పోతమ్ అలో వీక్లీ మ్యాగజైన్ రోష్ అలోలో క్రీడాస్ఫూర్తిని పూర్తిగా మరిచిపోయింది. ఇంకా టీమిండియాను అవమానపరిచేలా ఓ వ్యంగ్యాత్మక కటౌట్ ప్రకటించింది. ఆ కటౌట్‌ ఆఫ్ కటర్లుగా భారత ఆటగాళ్లు యువ బౌలర్ ముస్తాఫిజుర్ ఓ కటర్ పట్టుకుని ఉన్నాడు. 
 
అది అతని ఫేమస్‌ ఆఫ్‌ కటర్‌లను సూచించే విధంగా ఉంది. ‘టైగర్‌ స్టేషనరీ, మేడ్‌ బంగ్లాదేశ్‌, మిర్పూర్‌ స్టేడియం మార్కెట్లో ముస్తాఫిజుర్‌ కటర్‌ దొరుకుతుంది’ అని బోర్డులో రాసి ఉంది. కింద రహానె, రోహిత్‌ శర్మ, కోహ్లీ, ధోనీ, ధవన్‌, జడేజా, అశ్విన్‌లు అరగుండులతో ఓ బ్యానర్‌ పట్టుకుని నిలబడి ఉన్నారు. ఆ బ్యానర్‌పై ‘మేం ఉపయోగించాం. మీరూ వాడండి’ అని రాసి ఉంది. క్రీడా స్ఫూర్తిని మంటగలిపే ఇలాంటి వ్యంగ్య ప్రయోగాలు ఇరు దేశాల మధ్య స్పర్ధలకు దారితీసే అవకాశం ఉంది.