మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By Selvi
Last Updated : బుధవారం, 20 మే 2015 (19:27 IST)

బంగ్లాదేశ్‌లో టీమిండియా టూర్: ఆ ముగ్గురు లేకుండానే జట్టు ఎంపిక?

బంగ్లాదేశ్‌లో పర్యటించే భారత జట్టును బీసీసీఐ ఖరారు చేసింది. ముందుగా ఊహించినట్టే.. వన్డే జట్టులో సీనియర్ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్‌లు లేకుండానే జట్టును ఎంపిక చేసింది. దీర్ఘకాలం పాటు భారత క్రికెట్‌కు సేవలు చేస్తున్న వీరికి ఘనమైన వీడ్కోలు పలికేందుకు బీసీసీఐ యోచిస్తోందని సమాచారం.

ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్‌లో ఆడే టీమిండియా జట్టులో సెలక్టర్లు వీరికి స్థానం కల్పించలేదు. బంగ్లాదేశ్ టూర్లో భాగంగా టీమిండియా మూడు వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్ ఆడనుంది. భారత జట్టుకు వన్డేలకు విరాట్ కోహ్లీ, టెస్టుకు ధోనీ సారథ్యం వహించనున్నారు. అయితే టెస్టు జట్టులో మాత్రం భజ్జీకి స్థానం దక్కింది. 
 
బంగ్లాదేశ్‌లో పర్యటించనున్న భారత జట్టు వివరాలివే.. 
వన్డేలకు: ధోనీ (కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్సర్ పటేల్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, మోహిత్, బిన్నీ ధవాల్
 
టెస్టుకు: విరాట్ కోహ్లీ (కెప్టెన్), మురళీ విజయ్, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, పుజారా, రహానే, రోహిత్ శర్మ, సాహా, అశ్విన్, హర్భజన్ సింగ్, కార్న్, భువనేశ్వర్ కుమార్, ఉమేష్ యాదవ్, ఇషాంత్ శర్మ.